బీజేపీ ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి!.. బీజేపీ ఖండన

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (17:43 IST)
సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ నాయకులు పోలీసుల సమక్షంలో చేసిన దాడి కెసిఆర్ రాక్షస పాలనను తలపిస్తోందని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు.

కెసిఆర్ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి భూకబ్జాలకు మారుపేరుగా మారారని దీనిపై అరవిందు ప్రశ్నిస్తే దాడులు చేయడం గర్హనీయమని తీవ్రంగా ఖండిస్తున్నామని బాబురావు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ సభ్యుడు స్థాయి నాయకుడికే రక్షణ కల్పించలేని పోలీసులు దాడిని ముందుండి చేయించడం అమానుష చర్యగా అభివర్ణించారు.

బిజెపి కార్యాలయంపై, ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిపై విచారణ జరిపించి వరంగల్ ఎమ్మెల్యే లు నరేందర్ వినయభాస్కర్ లపై కేసు నమోదు చేయాలని, దాడి జరుగుతున్న సమయంలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments