Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీక్షిత్ హత్య కేసు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (11:41 IST)
ఇటీవల మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడి తల్లిదండ్రులు రంజిత్‌, వసంత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించారు. 
 
కిడ్నాపర్లు టెక్నాలజీ వాడుతూ పోలీసులకు చిక్కకుండా వసంతకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండటంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. 
 
కిడ్నాప్ చేసిన దుండగులు వసంతను రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, ఆ డబ్బు తీసుకుని వెళ్లినప్పటికీ కిడ్నాపర్లు దాన్ని తీసుకోవడానికి రాలేదు. చివరకు బాలుడిని హత్య చేశారు. ఆ బాలుడి మృతదేహం గుట్టల్లో లభ్యమైనట్లు తెలిసింది.
 
ఇదిలావుండగా, దీక్షిత్‌ని హత్య చేసిన ఇద్దరు (కిడ్నాపర్ల) నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు బాలుడికి సమీప బంధువులేనని సమాచారం. మరో ఇద్దరు బయటి వ్యక్తులుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులిద్దరినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments