పనికిమాలిన బడ్జెట్ - దేశానికి మేలు జరగదు : రేవంత్ రెడ్డి

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (16:07 IST)
లోక్‌సభలో మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది ఒక పనికిమాలిన బడ్జెట్ అని, దేశానికి ఎలాంటి మేలు జరగదన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ ఇలా ఏ ఒక్కరికి మేలు చేసేలా లేదన్నారు.
 
కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారని, అందుకే కక్ష గట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల రాయితీలో కోత విధించారని ఆరోపించారు. 
 
పంటలకు మద్దతు ధర తెస్తారని ఆశించామని, రైతులు పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యంగా, జీఎస్టీ పన్నుల విధానంలో మార్పులు చేయాలేదన్నారు. వైద్య మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం కుదుపటపడే పరిస్థితి వచ్చిందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఆరోగ్యం ఎవరికి ఉపయోగపడే నిర్ణయాలను ఈ బడ్జెట్‌లో వెల్లడించలేదని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

Mahesh Babu : తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌ను లాంచ్ చేయనున్న ఏఎంబీ సినిమాస్

తర్వాతి కథనం
Show comments