Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆ రెండు రోజుల్లో ఒంటి గంట వరకు?

మందుబాబులకు కిక్కించే వార్త ఇది. జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందుకొట్టొచ్చు. ఇది కేవలం శుక్ర, శనివారం మాత్రమే. ఈ సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్ప

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:54 IST)
మందుబాబులకు కిక్కించే వార్త ఇది. జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందుకొట్టొచ్చు. ఇది కేవలం శుక్ర, శనివారం మాత్రమే.  ఈ సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాత్రి 12 గంటలకు మాత్రమే బార్లకు అనుమతి వుండేది. తాజాగా గంట అదనంగా పొడిగించారు. కానీ ఈ గంట పొడిగింపు వారం మొత్తం కాదు. కేవలం శుక్ర, శని వారాల్లో మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. 
 
ఈ పొడగింపు నిబంధన హీహెచ్‌ఎంసీతో పాటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకే వర్తిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు  జారీ చేశారు. ప్రస్తుతం అన్ని వర్కింగ్ డేస్‌లో బార్లను ఉదయం 10 గంటల నుంచి… రాత్రి 12 గంటల వరకు ఉంచే  అవకాశం ఉంది.
 
వీకెండ్ రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో గంట టైం అదనంగా పెంచాలంటూ బార్ల యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి మేరకు.. వారంలో రెండు రోజుల పాటు అదనంగా మరో గంట పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. కొత్త నిర్ణయంతో వీకెండ్‌లో మధ్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని సర్కార్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments