Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ సైన్యం నుంచి షర్మిలా రెడ్డి సైన్యానికి బెదిరింపు కాల్స్, ఫిర్యాదు

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (15:36 IST)
షర్మిలా రెడ్డి. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో వచ్చే నెల 9న పార్టీ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈమె పార్టీ గురించి తెరాస, భాజపాలు అస్సలు పట్టించుకోవడంలేదు. ఆమధ్య హరీశ్ రావు ఎవరో వచ్చి పార్టీ పెడతామంటుండ్రు అనే ఒక్క మాట తప్పించి తెరాస నుంచి షర్మిల గురించి ఎవ్వరూ వ్యాఖ్యానించడంలేదు. మరోవైపు భాజపా సైతం షర్మిలకు తెలంగాణలో అంత సీన్ లేదని చెపుతున్నారు.
 
కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి మాత్రం రియాక్ట్ అయ్యారు. సీమాంధ్రకు చెందిన కొందరు ఇచ్చే పైసల కోసం షర్మిల పార్టీ పెడుతున్నారనీ, వారి పప్పులు ఇక్కడ వుడకవంటూ వ్యాఖ్యానించారు. ప్రజల్లో హైప్ క్రియేట్ చేయడానికి షర్మిల తమ నాయకుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని రేవంత్ సైన్యం ఆరోపిస్తుంది. ఇంకోవైపు రేవంత్ సైన్యం నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ షర్మిలా రెడ్డి సైన్యం ఆరోపిస్తోంది. విషయాన్ని డిజిపికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
 
ఇదిలావుంటే గోనె ప్రకాశరావు అయితే తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పార్టీలు పెట్టిన చిరంజీవి, దాసరి పరిస్థితి ఏమయ్యిందో చూశాం కదా. షర్మిల రాజకీయాలు మానుకుని హాయిగా సొంత పనులు చూసుకోవడం మంచిదని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments