Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికలు.. ఎంజీఆర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ.. కలిసొస్తుందా?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (15:17 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ఎంజీఆర్ పోటీ చేసిన చెన్నైలోని అలందూర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ ఆరవ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం ఇవాళ కమల్ రెండవ దశ ప్రచారం మొదలుపెట్టనున్నారు. 
 
మంగళవారం ఆయన కోవిడ్ టీకా తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని అలందూర్ స్థానాన్ని కమల్ ఎన్నుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1967 నుంచి 1976వరకు ఈ స్థానం ఎంజీఆర్ ఆధీనంలో ఉంది. అప్పట్లో ఈ స్థానాన్ని పరంగిమలై నియోజకవర్గంగా పిలిచేవారు. 
 
కమల్ ముందు నుంచీ తన ప్రచారంలో ఎంజీఆర్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో దాదాపు పది శాతం ఓట్లు పోలయ్యాయి. మార్చి ఏడో తేదీన మక్కల్ నీధి మయ్యం పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments