Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కసితీరా పొడిచి పొడిచి చంపిన భార్య, ఎందుకు?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:29 IST)
భర్తతో గొడవపడి అతడిని దారుణంగా పొడిచి చంపింది భార్య. హైదరాబాదు శివారులోని రాజేంద్రనగర్‌లో ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌కు చెందిన సబీనా రోషన్, విశాల్ దివాన్‌లు భార్యాభర్తలు. విశాల్ దివాన్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. సబీనాకు అప్పటికే ఒక వివాహం జరిగి విడాకులు తీసుకుంది. ఆమెకు 23 యేళ్ళ కుమార్తె ఉంది. భర్తతో విడాకుల అనంతరం విశాల్ దివాన్‌ను సబీనా రెండో వివాహం చేసుకుంది. వీరికి 12 యేళ్ళ కుమారుడు ఉన్నాడు.
 
అయితే గత కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి ఇద్దరిమధ్య తారాస్థాయిలో మనస్పర్థలు ఏర్పడి గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వంటగదిలోని కత్తితో భర్త పొట్టలో పొడిచింది.
 
కిందపడినా అతడిని వదిలిపెట్టలేదు. పొట్టలో పొడుస్తూనే ఉంది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రిని ఆ స్థితిలో చూసిన పిల్లలు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments