Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్ పైన ప్రియురాలికి తాళికట్టి ధైర్యం చెప్పిన ప్రియుడు, కానీ?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:38 IST)
కరోనా ఎన్నో బంధాలను బలితీసుకుంటోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన 27యేళ్ళ యువతి.. జీవితంపై ఎన్నో ఆశలు  పెట్టుకుంది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తోంది. ఈ యేడాది చివరలో తను ప్రేమించిన యువకుడిని పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంది.
 
వీరి ప్రేమకు ఇరువర్గాల పెద్దలు అంగీకరించారు కూడా. ఇక పెళ్ళిపీటలు ఎక్కడమే ఆలస్యమనుకున్నారు అంతా. సాఫీగా సాగిపోతుందనుకున్న ఆమె జీవితం విషాదంగా మారింది. ఆమె కరోనా బారిన పడింది.
 
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మూడేళ్ళుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు రోజూ ఆమెకు దైర్యం చెప్పేవాడు. ఆమెను బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. 
 
దీంతో ఆమె ధైర్యం కోల్పోయింది. ఆమెలో ధైర్యం పెంచేందుకు చికిత్స పొందుతున్న ఆమె బెడ్ పైనే తాళికట్టాడు యువకుడు. క్షేమంగా ఇంటికి వస్తుందనుకున్నాడు. సంతోషంగా జీవిద్దామనుకున్న యువతి, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు, ప్రేమించిన యువకుడు ఇద్దరూ కలిసి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. యువతి తల్లిదండ్రులకు కూడా కరోనా రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. కూతురు చనిపోయిందనే వార్త తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments