తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎక్కడి వారికి అక్కడే

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (22:58 IST)
ప్రయివేట్‌ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి పదో తరగతి చదువుకున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను ఎక్కడి వారిని అక్కడే తమ సొంత ప్రాంతాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు విద్యార్థుల వివరాలను తమ జిల్లా డిఇఒలకు పంపించాలని ప్రయివేట్‌ స్కూళ్ల యాజమాన్యాన్ని విద్యాశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రయివేట్‌ స్కూళ్లు, హాస్టళ్లు తెరిచేందుకు తాత్కాలికంగా అనుమతి ఇస్తామని విద్యాశాఖ హైకోర్టుకు వివరించింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఇస్తామని తెలిపింది.

దీంతో హైకోర్టు కలగజేసుకుని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసే విద్యార్థులను రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించింది.

దీంతో ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకుని రేపు చెబుతామని అటార్నీ జనరల్‌ (ఎజి) హైకోర్టుకు తెలిపారు. పరీక్షలు ప్రారంభమైతే ప్రతి ఐదు రోజులకొకసారి నిర్వహణను సమీక్షిస్తామని హైకోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments