Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్... నేడు - రేపు అధిక ఉష్ణోగ్రతలు.. హెచ్చరించిన ఐఎండీ

Webdunia
మంగళవారం, 30 మే 2023 (11:36 IST)
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. మంగళ, బుధవారాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 
 
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో ఎండలు సెగలుకక్కాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments