Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానంతో ఆస్తులు అమ్మి గుడి కట్టారు.. ఇపుడు అమ్మకానికి పెట్టారు...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (08:50 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆయనకు గుడి కట్టించారు. ఇందుకోసం తన ఆస్తులను సైతం అమ్ముకున్నారు. అలాంటి నేతలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన వారు... ఆ గుడిని, గుడిలోని విగ్రహానికి అమ్మకానికి పెట్టారు. ఈ ఘట తెలంగాణ రాష్ట్రంలోని దండేపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దండేపల్లి గ్రామానికి చెందిన గుండ రవీందర్‌ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌కు వీరాభిమాని. తెరాస నేత. ఈయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆస్తులు అమ్మి, అప్పులు చేసి గుడి కట్టించారు. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 
 
ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం కేసీఆర్ విగ్రహం ముఖాన్ని సంచులతో కప్పివేశాడు. తీరా ఇప్పుడు విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డానని, వేల రూపాయలు అప్పులు చేశానని, కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో గుడి కట్టినా నన్ను పట్టించుకోవడం లేదంటూ.. ఆయన ఇటీవల తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఉద్యమంలో చేసిన అప్పులు చెల్లించడం ఇబ్బందిగా మారిందని దీంతో విగ్రహాన్ని విక్రయించడానికి సిద్ధపడినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments