Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లలో కోకాపేట భూములు - ఎకరం రూ.55 కోట్లు

Webdunia
శనివారం, 17 జులై 2021 (09:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కోకాపేట భూముల ధర కోట్లాది రూపాయలు పలికింది. ఎకరం భూమి రూ.55 కోట్ల మేరకు అమ్ముడు పోయింది. దీన్నిబట్టే ఈ భూముల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
గత గురువరారం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో 45 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసింది. అలాగే, శుక్రవారం ఖానామెట్‌లో భూములను వేలం వేసింది. ఈ మేరకు 15 ఎకరాల్లోని 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. 
 
అత్యధికంగా ఒక ఎకరం రూ.55 కోట్లు, సగటున ఒక్కో ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్, జీవీపీఆర్ ఇంజినీర్స్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు భూములను దక్కించుకున్నాయి.
 
కాగా కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,729 కోట్ల ఆదాయం లభించడం విశేషం. కోకాపేట శివారులో త్వరలో ఐటీ హబ్ రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. పైగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత అక్కడి భూముల ధరలు ఈ స్థాయిలో అమ్ముడు పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments