ఆర్టీసీ కార్గో సిబ్బంది చేతివాటం : 51 కేజీల జామకాయలకు గాను... 21 కేజీలే చేరాయి..

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (11:47 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ కార్గో సేవలను ప్రారంభించింది. వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. అదేసమయంలో కార్గో సిబ్బందిలో కొందరు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి తాజా ఘటనే నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ రైతు 51 కేజీల జామకాయల బుట్టను పంపిస్తే అది హైదరాబాద్ నగరానికి చేరుకునే సమయానికి 27 కేజీలు తూగింది. దీనిపై హైదరాబాద్ కార్గో సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు తెలియదు.. ఇల్లెందులో అడగాలని సూచించారు. ఇల్లెందులో అడిగితే హైదరాబాద్ కార్గో సిబ్బందిని అడగాలంటూ అడ్డదిడ్డంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ యజమాని చేసేదేం లేక ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. 
 
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఇల్లెందు బస్టాండులో 51 కేజీల బరువుతో ఉండే బుట్టను ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నగరానికి పంపించారు. మరుసటి రోజు హైదరాబాద్ నగరానికి చేరాల్సిన ఆ బుట్ట ఒక రోజు ఆలస్యంగా చేరింది. అంటే ఈ నెల 20వ తేదీన వచ్చింది. ఉప్పల్ ప్రాంతానికి చెందిదన అనిల్ అనే యువకుడు ఈ పార్శిల్‌ను తీసుకున్నాడు. అయితే బుట్ట బరువు తక్కువగా ఉండటంతో అక్కడే తూకం వేయించగా, 51 కేజీల బరువు ఉండాల్సిన జామకాయలు 27 కేజీలు మాత్రమే ఉన్నట్టు చూపించింది.
 
దీనిపై ఆయన కార్గో సిబ్బందిని నిలదీయగా వారు తమకేం తెలియదని చెప్పారు. దీంతో ఆయన ఆర్టీసీ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఆర్టీసీ కార్గో బిజినెస్ హెడ్ సంతోష్ మీడియాతో మాట్లాడుతూ, పార్శిల్ విషయంలో ఫిర్యాదు అందిందని, విచారించి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments