Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనెవర్నీ మోసం చేయలేదు.. చీటింగ్ కేసు కొట్టేయండి.. సన్నీ లియోన్

sunny leone
, గురువారం, 17 నవంబరు 2022 (11:07 IST)
తాను ఎవర్నీ మోసం చేయలేదని బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ అంటున్నారు. అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ ఆమె కేరళ కోర్టును ఆశ్రయించారు. 
 
కేరళ రాష్ట్రంలోని పెరంబవుర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం.షియాన్ బాలీవుడ్ నటి సన్నీపై చీటింగ్ కేసు పెట్టాడు. గత 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ మేనేజర్‌కు రూ.30 లక్షల రూపాయలు ఇచ్చామని, కానీ ఆమె ఈవెంట్‌కు రాలేదని అందులో పేర్కొన్నారు. దీంతో కేరళ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవర్నీ మోసం చేయలేదనీ, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చాలాసార్లు కార్యక్రమ తేదీని మార్చారని, దాంతో నాకు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వీలుపడలేదని, అంతేకానీ, తాను ఎవరినీ మోసం చేయలేదని, అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేద్దాం... విజయ్ దేవరకొెండ