Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్‌లో చిక్కుకున్న తెలంగాణా వాసులు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (10:24 IST)
తాలిబన్ల వశమైన ఆఫ్గనిస్థాన్‌లో పలువురు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా తెలంగాణా వాసులు ఇక్కడ చిక్కుకునిపోయారు. వీరిని రాష్ట్రానికి తీసుకొచ్చేందు ప్రభుత్వాలు సహకరించాలని బాధితుల కటుంబాలు కోరుకున్నారు. 
 
ప్రస్తుతం ఆప్ఘాన్‌లో తెలంగాణవాసులు బొమ్మెన రాజన్న, వెంకటయ్య చిక్కుకున్నారు. తమతో పాటు మరో 14 మంది భారతీయులు  ఉన్నారని బాధితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన బొమ్మెన రాజన్న.. 8 ఏళ్లుగా కాబుల్‌లోని ఏసీసీఎల్‌లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇంటికి వచ్చిన రాజన్న.. తిరిగి ఈ నెల 7న కాబుల్‌కు వెళ్లారు. 
 
అయితే, ఆఫ్ఘనిస్తాన్‌.. తాలిబన్ల ఆక్రమణకు గురి కావడంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు బాధితులు అక్కడ చిక్కుకున్నారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

పోలీస్ కంప్లెయింట్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments