Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలి : మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (18:12 IST)
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీసీఐను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వారంతా మంత్రిని కోరారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ పునఃప్రారంభంకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన తెలిపారు. 
 
సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments