Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలి : మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (18:12 IST)
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీసీఐను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వారంతా మంత్రిని కోరారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ పునఃప్రారంభంకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన తెలిపారు. 
 
సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments