హుస్నాబాద్‌‌లో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:32 IST)
ఇటీవలికాలంలో ఉన్నట్టుండి గుండెపోటులకు గురై మృత్యువాత పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. క్రీడలు ఆడుతూ చనిపోతారు. మరికొందరు కూర్చొనివున్న చోటే మృత్యువాతపడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 
తాజా తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట హుస్నాబాద్‌లో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలో జరుగుతున్న కేఎంఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో శనిగరం ఆంజనేయులు (37) పాల్గొన్నారు. 
 
ఈ క్రమంలో బౌలింగ్‌ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడి స్వస్థలం చిగరుమామిడి మండలం సుందరగిరి. ఈ ఘటనతో హుస్నాబాద్‌లో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments