Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె తుట్టెకు నిప్పుపెట్టబోయి... సజీవదహనమైన యువకుడు...

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సులోని తేనె తుట్టెకు నిప్పు పెట్టడంతో.. ప్రమాదవశాత్తూ మంటలంటుకొని సజీవదహనమయ్యాడు. 
 
కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా బడులు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సులను ఖాళీ స్థలంలో పార్క్ చేశారు. యేడాదిగా వాటిని కదపకపోవడంతో ఓ బస్సులో తేనెటీగలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 
 
తేనెతుట్టెను గమనించిన బుడగజంగాల మహదేవ్‌(55), గోపిలు దాన్ని కొట్టేందుకు ప్రయత్నించాడు. పొగ పెడితే తేనెటీగలు పారిపోతాయని, అప్పుడు తేనెను సులభంగా తీసుకోవచ్చని మహదేవ్‌ బస్సులోకి వెళ్లి మంట వెలిగించాడు.
 
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సుకే మంటలు అంటుకున్నాయి. భయపడిన గోపి అక్కడినుంచి పరిగెత్తాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న మరో రెండు బస్సులకూ మంటలు నిమిషాల వ్యవధిలో వ్యాపించాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి ఓ ఇంటి నల్లాకు మోటారు అమర్చి మంటలార్పారు. 
 
అయితే అక్కడ ఎవరూ లేరు.. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఉండొచ్చని అందరూ భావించారు. అయితే గంటన్నర తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక  ఓ యువకుడు బస్సెక్కగా.. అక్కడ మహదేవ్‌ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. మహదేవ్‌ తమ్ముడి కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మహదేవ్ మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments