Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. బ్లాక్ మెయిల్.. అత్యాచారం..

Webdunia
బుధవారం, 22 జులై 2020 (12:08 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయో బేధాలు లేకుండా వావివరుసలు లేకుండ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా చాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వేమనపల్లి మండలంలోని సూరారం గ్రామంలో జరిగింది. 
 
గ్రామానికి చెందిన రసపెల్లి మధు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో వీడియో తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో పరువు పోతుందన్న భయంతో బాధితురాలు అతడికి లొంగిపోయింది. 
 
దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కామాంధుడు అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినా వేధింపులు తాళలేకపోవడంతో బాధితురాలు తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతడు భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం