Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. బ్లాక్ మెయిల్.. అత్యాచారం..

Webdunia
బుధవారం, 22 జులై 2020 (12:08 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయో బేధాలు లేకుండా వావివరుసలు లేకుండ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా చాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వేమనపల్లి మండలంలోని సూరారం గ్రామంలో జరిగింది. 
 
గ్రామానికి చెందిన రసపెల్లి మధు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో వీడియో తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో పరువు పోతుందన్న భయంతో బాధితురాలు అతడికి లొంగిపోయింది. 
 
దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కామాంధుడు అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినా వేధింపులు తాళలేకపోవడంతో బాధితురాలు తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతడు భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం