కొత్తగూడెంలో విషాదం.. పురుగుల మందు తాగిన ప్రేమజంట

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:27 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట పురుగుల మందు సేవించింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో జరిగింది. 
 
మృతురాలి పేరు బోడ శ్వేత‌(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంక‌టేశ్ అనే యువ‌కుడిని ప్రేమిస్తోంద‌ని తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించగా, అందుకు పెద్దలు సమ్మతించలేదు. దీంతో వారిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ఈ దారుణానికిపాల్పడ్డారు 
 
కాగా, పురుగుల మందు తాగిన యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో స్థానిక ఆసుప‌త్రిలోని వైద్యులు చెప్ప‌డంతో అత‌డిని అక్క‌డికి మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఖ‌మ్మం ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments