Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండికి హైకోర్టులో ఊరట.. రిమాండ్ రిపోర్టు కొట్టివేత.. బెయిల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (17:04 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసన జీవో 317ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన కరీంనగర్‌లోని జాగరణ దీక్ష తలపెట్టారు. దీనికి కరీంనగర్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన నివాసంలోనే దీక్షకు దిగేందుకు పూనుకున్నారు. 
 
అయితే, కరీంనగర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, కింది కోర్టు జారీచేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments