Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండికి హైకోర్టులో ఊరట.. రిమాండ్ రిపోర్టు కొట్టివేత.. బెయిల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (17:04 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసన జీవో 317ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన కరీంనగర్‌లోని జాగరణ దీక్ష తలపెట్టారు. దీనికి కరీంనగర్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన నివాసంలోనే దీక్షకు దిగేందుకు పూనుకున్నారు. 
 
అయితే, కరీంనగర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, కింది కోర్టు జారీచేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments