Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండికి హైకోర్టులో ఊరట.. రిమాండ్ రిపోర్టు కొట్టివేత.. బెయిల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (17:04 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసన జీవో 317ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన కరీంనగర్‌లోని జాగరణ దీక్ష తలపెట్టారు. దీనికి కరీంనగర్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన నివాసంలోనే దీక్షకు దిగేందుకు పూనుకున్నారు. 
 
అయితే, కరీంనగర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, కింది కోర్టు జారీచేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments