Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యత ఉండక్కర్లేదా? లేఖలు రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (17:45 IST)
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపరాధం విధించింది. ఆరేళ్లు గడిచినా విభజన సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల పోలీసు కేడర్‌ విభజన ప్రక్రియపై మండిపడింది. ఈ కసరత్తును తక్షణం పూర్తి చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. 
 
కేడర్‌ విభజనపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే జరిగిన జాప్యం, ఇతర అంశాలపై న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తూ, కేంద్రానికి బాధ్యత లేదా అని నిలదీసింది.   
 
కేడర్‌ విభజన చేపట్టాలంటూ లేఖలు రాస్తే సరిపోతుందా... ఇందులో జోక్యం చేసుకొని సానుకూలంగా కేడర్‌ విభజన జరిగేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ, తెలంగాణ, కేంద్రానికి రూ.5 వేల చొప్పున అపరాధం విధించింది. 
 
కేడర్‌ విభజనపై తెలంగాణ పోలీసు అధికారి జి. నాగన్న వేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ అమర్‌నాధ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించి కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య డీఎస్పీ, ఏఎస్‌పీ, ఎస్పీ(నాన్‌కేడర్‌)ల కేడర్‌ విభజన జరగాలి. ఆరేళ్లయినా ఈ ప్రక్రియ జరగలేదని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments