తెలంగాణ గవర్నర్ కార్యక్రమాలు వాయిదా

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:12 IST)
కరోనా ప్రభావంతో రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇందుకు ప్రధాన కారణం.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహాయే. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని ఆ శాఖ కోరింది. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు తదుపరి సమావేశాల తేదీలు నిర్ణయిస్తాయని తెలిసింది.

మూడు వేల కోళ్లు పంపిణీ 
కరోనా ప్రభావంతో పౌల్ర్టీ రైతులు విలవిలలాడుతున్నారు. రెండు నెలలు కోళ్లను పెంచిన ఓ రైతు, అవి అమ్ముడు పోకపోవడంతో ఆదివారం ఉచితంగా పంపిణీ చేశాడు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌కు చెందిన రవీందర్‌ కోళ్లను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లగా రూ.10కి ఒక కోడి కొనుగోలు చేస్తామని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెప్పారు. దీంతో రవీందర్‌ గ్రామస్థులందరినీ పిలిచి తన పౌల్ర్టీ ఫాంలోని మూడు వేల కోళ్లను ఉచితంగా అందజేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments