Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు లబ్దిదారులకు శుభవార్త - నగదుపై వడ్డీ చెల్లింపు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి దళితబంధు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పింది. దళిత బంధు పథకం అమలులో భాగంగా యూనిట్లు మంజూరయ్యేంత వరకు ప్రత్యేక ఖాతాల్లో నగదుపై వడ్డీని జమ చేయనున్నట్టు తెలిపారు. 
 
లబ్దిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పథకం అమలులో భాగంగా, మూడు నెలల క్రితమే ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. తాజాగా నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారుడుకి కనీసం 8 నుంచి 9 వేల వరకు వడ్డీ రూపంలో నగదు అందుతుందని సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. 
 
కాగా, పథకం అమలులో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు దాని పరిధిలోని దాదాపు 20వేల మంది లబ్దిదారులు ఉంటారని అంచనా వేసింది. 
 
వీరిలో ఇప్పటికే 18 వేల మందికి రూ.10 లక్షలు చొప్పున రూ.1800 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. పాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేయగా, ఇప్పటికే 66 ఖాతాల్లో నగదు జమ చేసింది. బ్యాంకుల్లో లబ్దిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలను ఓపెన్ చేసి ఈ నిధులను జమ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments