Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు లబ్దిదారులకు శుభవార్త - నగదుపై వడ్డీ చెల్లింపు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి దళితబంధు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పింది. దళిత బంధు పథకం అమలులో భాగంగా యూనిట్లు మంజూరయ్యేంత వరకు ప్రత్యేక ఖాతాల్లో నగదుపై వడ్డీని జమ చేయనున్నట్టు తెలిపారు. 
 
లబ్దిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పథకం అమలులో భాగంగా, మూడు నెలల క్రితమే ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. తాజాగా నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారుడుకి కనీసం 8 నుంచి 9 వేల వరకు వడ్డీ రూపంలో నగదు అందుతుందని సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. 
 
కాగా, పథకం అమలులో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు దాని పరిధిలోని దాదాపు 20వేల మంది లబ్దిదారులు ఉంటారని అంచనా వేసింది. 
 
వీరిలో ఇప్పటికే 18 వేల మందికి రూ.10 లక్షలు చొప్పున రూ.1800 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. పాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేయగా, ఇప్పటికే 66 ఖాతాల్లో నగదు జమ చేసింది. బ్యాంకుల్లో లబ్దిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలను ఓపెన్ చేసి ఈ నిధులను జమ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments