Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు - మొత్తం కేసులు 20

తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు - మొత్తం కేసులు 20
, ఆదివారం, 19 డిశెంబరు 2021 (10:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు ఉండటం గమనార్హం. ఈ 12 మందితో కలుపుకుంటే తెలంగాణాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20కి చేరింది. 
 
ఇదిలావుంటే, కెన్యా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సోకింది. అయితే, ఆయన అధికారుల కన్నుగప్పి అదృశ్యమయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ముమ్మరంగా గాలించి, అపోలో ఆస్పత్రిలోని అతిథి గృహంలో ఉన్న ఆ రోగిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గత 2020 మార్చి నుంచి ఇప్పటివరకు ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,081 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 7,469 మంది కోలుకున్నారు. అదేసమయంలో 264 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 83,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 3,41,78,940 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 4,77,422 మంది చనిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో బాగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు