Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సెలవులు పొడిగింపు.. అంతా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (16:27 IST)
దసరా సెలవులను పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది.

అయితే, ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసే క్రమంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. దీంతో సర్కారు కూడా దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దసరా సెలవులు అక్టోబర్ 19 (శనివారం) వరకు పొడిగించారు. ఇక ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 21 నుంచి అంటే సోమనారం నాడు మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 
 
కాగా తెలంగాణలో ఆర్టీసిని విలీనం చేయాలంటూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం.. సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది.

ఈ క్రమంలో కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను సాధించే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చేశాయి. ఈ క్రమంలో వారం రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. దీంతో దసరా సెలవులను పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు రాకతో అల్లకల్లోలాన్ని రేపిన సునీల్ గ్రోవర్‌

Ajay Devgn : నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా : జాకీ చాన్

ఆదర్శవంతమైన పాలకులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక : నారా రోహిత్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments