Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సెలవులు పొడిగింపు.. అంతా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (16:27 IST)
దసరా సెలవులను పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది.

అయితే, ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసే క్రమంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. దీంతో సర్కారు కూడా దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దసరా సెలవులు అక్టోబర్ 19 (శనివారం) వరకు పొడిగించారు. ఇక ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 21 నుంచి అంటే సోమనారం నాడు మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 
 
కాగా తెలంగాణలో ఆర్టీసిని విలీనం చేయాలంటూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం.. సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది.

ఈ క్రమంలో కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను సాధించే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చేశాయి. ఈ క్రమంలో వారం రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. దీంతో దసరా సెలవులను పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments