Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:30 IST)
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిత వేగంతో దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళా కూలీలే కావడం గమనార్హం. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళుతున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108 సిబ్బంది సాయంతో ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నలుగురూ మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని డాకోజి నాలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు ధనలక్ష్మి, దేవరపల్లి శిరీష్‌లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments