Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:30 IST)
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిత వేగంతో దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళా కూలీలే కావడం గమనార్హం. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళుతున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108 సిబ్బంది సాయంతో ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నలుగురూ మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని డాకోజి నాలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు ధనలక్ష్మి, దేవరపల్లి శిరీష్‌లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments