Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడే పుట్టిన కవల ఆడపిల్లలకు విషం తాపించిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (13:13 IST)
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా... కొంతమంది మనషులు మాత్రం మారడం లేదు. విద్యావంతులతో పాటు.. నిరక్ష్యరాస్యులు కూడా ఒకేలా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి అపుడ పుట్టిన ఇద్దరు కవల ఆడపిల్లలకు విషం తాపించాడు. దీంతో ఆ ఇద్దరు శిశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 
 
ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశాయిపల్లికి చెందిన కృష్ణ‌వేణి అనే మహిళ ఇటీవల ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఇప్పటికే ఓ కూతురు ఉం‌ది. 
 
రెండో కాన్పులో కూడా ఆడపిల్లలే పుట్టారని తండ్రి కేశ‌వులు ఆగ్రహంతో ఊగిపోయాడు. ముగ్గుర ఆడపిల్లల పోషణ తనవల్లకాదని వాపోయాడు. ఈ క్రమంలో ఎవరికీ తెలియకుండా క‌వ‌ల ఆడ శిశువుల‌తో పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ శిశువులు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లడాన్ని గమినించిన కుటుంబ సభ్యులు వారిని పిల్ల‌ల ఆసుపత్రిలో చేర్పించారు.
 
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవల కేశ‌వులు ఓ దుకాణంలో పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments