తెలంగాణలో కరోనా విజృంభణ.. 337మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:34 IST)
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా టెస్టులు నిర్వహించగా 337 మందికి కరోనా సోకినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇందులో 2,98,826 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 2,958 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1671కి చేరింది. ముఖ్యంగా పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. 
 
గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య .. వెళితే కరోనా భయం..ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శరీరం చెప్పే ప్రతి మాటనూ అందరూ వినాలి : చిరంజీవి

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments