Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు దళిత బంధుకు శ్రీకారం : సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదే

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (10:19 IST)
తెలంగాణ సర్కారు దళిత బంధు పథకానికి సోమవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రారంభిచనుంది. ఇందుకోసం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
ఇందుకోసం సీఎం కేసీఆర్ సోమవారం శాలపల్లికి చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హుజూరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.
 
మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు శాలపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 
 
సీఎం రాకతో హుజూరాబాద్‌ గులాబీ వర్ణ శోభితమైంది. గ్రామ గ్రామ సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శాలపల్లికి వెళ్లే మార్గాన్ని మొత్తం సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. దీంతో హుజూరాబాద్‌ మొత్తం గులాబీమయమైంది.
 
దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌లో ప్రారంభించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. శాలపల్లి ఇందిరానగర్‌లో నిర్వహించనున్న సభలో లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వబోతున్నారు. 2018 మే 10న ఇదే వేదికపై రైతుబంధును ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments