Publish Date: Sat, 14 Aug 2021 (10:35 IST)
Updated Date: Sat, 14 Aug 2021 (10:38 IST)
తెలంగాణలో పీసీసీ కార్యవర్గ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగనుంది. హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సురేఖ కాదంటే మరో ముగ్గురి పేర్లను పరిశీలించనుంది. కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ , ఓఎన్ఆర్ఐ రేసులో ఉన్నట్లు సమాచారం.