Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:45 IST)
కోవిడ్ వైరస్ తెలంగాణలో విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. తాజాగా షాకింగ్ న్యూస్ ఏమింటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కరోనా మహమ్మారి వదల్లేదని తెలిసింది. 
 
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ లిస్ట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేరారు.
 
సీఎం కేసీఆర్ గజ్వేల్ లోని ఫాం హౌస్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్న కేసీఆర్ కి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. 
 
గత నాలుగు రోజుల క్రితం సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ది నోముల భగత్ సహా మరికొంత మంది నేతలకు ఈ కరోనా సోకినట్లు తెలుస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

తర్వాతి కథనం
Show comments