Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారెంటైన్లో...

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:42 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా స్వల్ప లక్షణాలు వున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం సీఎం హోం క్వారెంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా పరీక్షలు చేశామనీ, అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి ఇచ్చిన అధికారిక నోట్‌లో పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, తన ఫామ్‌హౌస్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారని ముఖ్య కార్యదర్శి తెలిపారు. వైద్యుల బృందం ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.
 
 కాగా ఇటీవలే తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన చికిత్స చేయించుకుని నెగటివ్ రిపోర్టుతో బయటకు వచ్చారు. తాజాగా నాగార్జున ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయనకు అక్కడ కరోనా సోకి వుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 
 రాష్ట్ర రాజధానిలో 705 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ప్రక్కనే ఉన్న మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలో వరుసగా 363, 336 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments