Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా భాజపాకి బుద్ధి రాలేదు: కేసీఆర్

Webdunia
శనివారం, 27 మే 2023 (18:54 IST)
భాజపాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందనీ, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధీనంలో పనిచేయకుండా ఆర్డినెన్స్ తెచ్చి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్ విషయమై సుప్రీంకోర్టు సైతం తప్పని చెప్పినా భాజపా పట్టించుకోవడం లేదన్నారు.
 
ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్సును ఉపసంహరించుకునే వరకూ తాము పోరాడతామన్నారు. ఈ విషయమై మద్దతు కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ శనివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారనీ, ఐతే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. గవర్నర్లు భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా మారారనీ, కర్నాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా భాజపాకి బుద్ధి రాలేదని అన్నారు. త్వరలోనే భాజపాకి దేశం యావత్తు గుణపాఠం చెబుతుందని అన్నారు కేసీఆర్.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments