తెలంగాణ సీఎం ప్రెస్ మీట్.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:03 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశారు. 
 
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు. 
 
చెన్నూరు ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.  
 
ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...  తెలంగాణ‌లో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీల‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింద‌న్నారు. కావేరి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీకి ఆమోదం ల‌భించిందన్నారు.
 
ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాల‌ను సంబంధిత మంత్రులే చూసుకుంటార‌ని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివ‌ర్సిటీని త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింద‌ని సీఎం తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments