Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం ప్రెస్ మీట్.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:03 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశారు. 
 
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు. 
 
చెన్నూరు ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.  
 
ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...  తెలంగాణ‌లో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీల‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింద‌న్నారు. కావేరి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీకి ఆమోదం ల‌భించిందన్నారు.
 
ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాల‌ను సంబంధిత మంత్రులే చూసుకుంటార‌ని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివ‌ర్సిటీని త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింద‌ని సీఎం తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments