Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్తా చాటిన సిద్ధిపేట.. వ్యాక్సినేషన్‌లో ప్రైమ్ మినిస్టర్ అవార్డ్

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (18:49 IST)
సిద్ధిపేట జిల్లా సత్తా చాటింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులో సిద్ధిపేట మంచి ఫలితాలను సాధించింది. 
 
దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ -2019కి ఎంపిక చేసింది. 
 
ఇందులో భాగంగా ఏప్రిల్ 20-21న ఢిల్లీలో జరిగే "సివిల్ సర్వీసెస్ డే" కార్యక్రమంలో ట్రోఫీతో పాటు రు.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది.
 
సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడంపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. 
 
రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి వంద శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తుంద‌ని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments