Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిల్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్న బాలుడు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (13:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రులు సైకిల్ కొనివ్వలేదని ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం సూరారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన పారండ్ల మధు (12) అనే బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా తనకు సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడుగుతూ వారిని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అయితే, తల్లిదండ్రులు కరోనా కారణంగా తమ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తర్వాత కొనిస్తామని సర్దిచెబుతూ వస్తున్నారు. 
 
అయితే, బాలుడు మాత్రం తల్లిదండ్రుల మాట వినలేదు. చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ తొక్కుతున్నారని, తనకూ సైకిల్ కావాలని మారం చేశాడు. దీంతో గురువారం ఉదయం కుమారుడిని మందలించి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. 
 
కానీ సాయంత్రం వాళ్లు వచ్చేసరికి కుమారుడు ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించసాగారు. తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments