Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న - కేసీఆర్ అత్యంత మోసకారి!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ యాంకర్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత తరుణ్ ఛుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, చింతపండు నవీన్‌ను తెలంగాణ ప్రజలు తీన్మార్ మల్లన్నగా చేశారు. ఇపుడు భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరులను స్థూపానికి కట్టేస్తానని ప్రకటించారు 
 
తెలంగాణా రాష్ట్రంలో అత్యంత మోసకారి ఒక్క కేసీఆర్ అని ఆరోపించారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. మున్ముందు తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం లేకుండా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments