ఏపీ సీఎం జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారు : లంకా దినకర్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ సీఎంగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేత లంకా దినకర్ జోస్యం చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.10 వేల చొప్పున వన్ టైమ్ సెటిల్మెంట్ వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
ఈ వ్యవహారంపై ఏపీలో రగడ కొనసాగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌లో ఒకే మొత్తంలో రుణ బకాయిలు చెల్లించి జగనన్న సంపూర్ణ స్వగృహ పథకం ద్వారా లబ్దిదారులు ఇళ్ళపై పూర్తి హక్కులు పొందాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దీనిపై టీడీపీ నేత లంకా దినకర్ స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే వ్యాపారం ఎక్కువై పోయిందని చెప్పారు. సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాల పాత గృహ లబ్దిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్‌గా మారారని, ఈయన కూడా ఓటీఎస్ ముఖ్యమంత్రిగా మారిపోతారని లంకా దినకర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments