Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారు : లంకా దినకర్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ సీఎంగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేత లంకా దినకర్ జోస్యం చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.10 వేల చొప్పున వన్ టైమ్ సెటిల్మెంట్ వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
ఈ వ్యవహారంపై ఏపీలో రగడ కొనసాగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌లో ఒకే మొత్తంలో రుణ బకాయిలు చెల్లించి జగనన్న సంపూర్ణ స్వగృహ పథకం ద్వారా లబ్దిదారులు ఇళ్ళపై పూర్తి హక్కులు పొందాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దీనిపై టీడీపీ నేత లంకా దినకర్ స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే వ్యాపారం ఎక్కువై పోయిందని చెప్పారు. సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాల పాత గృహ లబ్దిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్‌గా మారారని, ఈయన కూడా ఓటీఎస్ ముఖ్యమంత్రిగా మారిపోతారని లంకా దినకర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments