Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 6 March 2025
webdunia

బీజేపీలో చేరాలంటూ డబ్బు ఆశ చూపుతున్నారు : ఆప్ ఎంపీ భగవత్ సింగ్

Advertiesment
బీజేపీలో చేరాలంటూ డబ్బు ఆశ చూపుతున్నారు : ఆప్ ఎంపీ భగవత్ సింగ్
, సోమవారం, 6 డిశెంబరు 2021 (12:35 IST)
భారతీయ జనతా పార్టీపై పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఎంపీ భగవత్ మన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డబ్బుతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ బీజేపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనిర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశ చూపించారని ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో చోటుకల్పిస్తామని ప్రలోభ పెట్టారని చెప్పారు. అయితే, ఆ నేత పేరును సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు. 
 
అంతేకాకుండా, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిచారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు తెరతీసిందని ఆరోపించారు. అయితే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నటికీ అమ్ముడుపోమన్నారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టిసారించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీకి టైమ్ వచ్చేసింది..