Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (10:15 IST)
kunda satyanarayana
సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ బుధవారం కన్నుమూశారు. సురేంద్రపురి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉంది. శివుడు, నాగదేవత భారీ విగ్రహాలతో పాటు మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలకు దృశ్య రూపమిచ్చి కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత సత్యనారాయణకే దక్కుతుంది. కాగా సత్యనారాయణ 1938 జూన్‌ 15న తేదీన జన్మించారు. 
 
ఆయనకు ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్‌, ప్రతాప్‌, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. ఆయన మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 
కాగా అనారోగ్యం బారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్‌ జ్ఞాపకార్థంగా యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ సురేంద్రపురి పేరుతో హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శిల్పకళకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments