తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదే లే అంటున్న సూర్యుడు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (11:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో సూర్యభగవానుడు తగ్గేదే లే అంటున్నారు. సూర్యతాపం దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దీంతో ముందుగానే పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇప్పటికే ఎండ తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల పనివేళలను కుదించింది. అయితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. 
 
కొమరం భీమ్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కౌటాలలో 43.7గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీలు, జైనాథ్‌లో 43.8డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్‌లో 43.3ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పని వేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటలుగా విద్యాశాఖ నిర్ణయించింది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments