Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో దారుణం.. చిన్న గొడవ.. నిండు ప్రాణాలు బలి..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (10:38 IST)
శ్రీశైలంలో దారుణం జరిగింది. చిన్న గొడవ ఏకంగా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంగళవారం శ్రీశైలం ఆర్డీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ సత్రంలో సిబ్బందికి, భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు  మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన నలుగురు భక్తులు శ్రీశైలానికి వచ్చారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం సమయంలో కాకతీయ సత్రానికి వెళ్లారు. భోజనం వడ్డించమని సిబ్బందిని కోరగా.. వారు నిరాకరించారు. భోజన సమయం ముగిసిందని.. బఫే పద్ధతిలో మీరే వడ్డించుకోవాలని సత్రం ఇంచార్జి కందిమల్ల శ్రీనివాసరావు సూచించారు. ఆయన సమాధానంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాట జరిగింది. శ్రీనివాసరావును భక్తులు తోసివేయడంతో ఆయన కిందపడ్డారు. తలకు గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐతే మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడించారు. మృతుడు శ్రీనివాసరావు స్వస్థలం గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం దండముడి గ్రామం. ఏడేళ్లుగా ఆయన శ్రీశైలంలోని సత్రంలో పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments