Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏమాత్రం తగ్గని కేసుల సంఖ్య

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏమాత్రం తగ్గని కేసుల సంఖ్య
, బుధవారం, 23 డిశెంబరు 2020 (20:05 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 490 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,718 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,68,769 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 
 
మరో 3,864 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,085 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,716 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,14,15,246 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మరో నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 1522 మంది మృతిచెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్ వెజ్ టేస్ట్.. కానీ వెజ్ పిజ్జా.. డామినోస్ సూపర్ ఫుడ్