Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ : కేసీఆర్ నిర్ణయం

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (08:47 IST)
ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సెషన్ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా ఈ నెల 9 నుంచే పంపిణీ చేయాలని ఆదేశించారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు.
 
ఈ నెల 8న వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments