Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ, వాళ్లు నాపై అత్యాచారం చేయలేదు, 36 మంది మాత్రం: మిర్యాలగూడ యువతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:50 IST)
తనపై 139 మంది అత్యాచారం చేశారని సంచలన ఆరోపణలు చేసిన మిర్యాలగూడ బాధిత యువతి యు-టర్న్ తీసుకున్నది. తనపై ఎవరూ అత్యాచారం చేయలేదని, డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఐతే మళ్లీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది.
 
సోమవారం నాడు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ అధ్యక్షతన పలు ప్రజాసంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తనపై 139 మంది అత్యాచారం అంతా అబద్ధం, రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అతడు చెప్పినట్లు చెప్పానని తెలిపింది. అంతేకాదు.. తనను అత్యాచారం చేసినట్లు పలువురు మీద నిందారోపణలు చేశాననీ, వారికి ఇబ్బంది కలిగించానని, వారికి మీడియా ద్వారా క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. 
 
ఐతే తనపై 36 మంది అత్యాచారం చేశారని వెల్లడించింది. వారి పేర్లను పోలీసులకు అందించినట్లు తెలిపింది. తను ఉద్యోగం ద్వారా డాలర్ బోయ్ పరిచయమయ్యాడనీ, తనకంటే ముందే ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడని చెప్పింది.
 
గతంలో తన మాట వినని వారిని ఎలా చంపాడో తెలుపుతూ వుండే ఫోటోలను తనకు చూపించి, అలాగే తనను కూడా చంపేస్తానని బెదిరించడంతో మరో మార్గం లేక ఇలా చెప్పానని వెల్లడించింది. డాలర్ బోయ్ ను శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. అనంతరం ప్రజాసంఘాల నాయకులు కూడా యువతిని బెదిరించి, అఘాయిత్యాలకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని, కేసును సీఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments