Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ, వాళ్లు నాపై అత్యాచారం చేయలేదు, 36 మంది మాత్రం: మిర్యాలగూడ యువతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:50 IST)
తనపై 139 మంది అత్యాచారం చేశారని సంచలన ఆరోపణలు చేసిన మిర్యాలగూడ బాధిత యువతి యు-టర్న్ తీసుకున్నది. తనపై ఎవరూ అత్యాచారం చేయలేదని, డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఐతే మళ్లీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది.
 
సోమవారం నాడు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ అధ్యక్షతన పలు ప్రజాసంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తనపై 139 మంది అత్యాచారం అంతా అబద్ధం, రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అతడు చెప్పినట్లు చెప్పానని తెలిపింది. అంతేకాదు.. తనను అత్యాచారం చేసినట్లు పలువురు మీద నిందారోపణలు చేశాననీ, వారికి ఇబ్బంది కలిగించానని, వారికి మీడియా ద్వారా క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. 
 
ఐతే తనపై 36 మంది అత్యాచారం చేశారని వెల్లడించింది. వారి పేర్లను పోలీసులకు అందించినట్లు తెలిపింది. తను ఉద్యోగం ద్వారా డాలర్ బోయ్ పరిచయమయ్యాడనీ, తనకంటే ముందే ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడని చెప్పింది.
 
గతంలో తన మాట వినని వారిని ఎలా చంపాడో తెలుపుతూ వుండే ఫోటోలను తనకు చూపించి, అలాగే తనను కూడా చంపేస్తానని బెదిరించడంతో మరో మార్గం లేక ఇలా చెప్పానని వెల్లడించింది. డాలర్ బోయ్ ను శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. అనంతరం ప్రజాసంఘాల నాయకులు కూడా యువతిని బెదిరించి, అఘాయిత్యాలకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని, కేసును సీఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments