Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తగారింట్లో కోడలు ఆత్మహత్య ... ఎందుకో పాపం?

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కోరుట్లలో వున్న అత్తగారింటిలో ఉంటూ వచ్చిన కోడలు ఆ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ బలవన్మరణానికి పాల్పడిన కోడలు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 
 
ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. జిల్లాలోని మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఆడెపు సాయిలక్ష్మి(28)కి 14 నెలల క్రితం కోరుట్లలోని గాంధీరోడ్డులో నివాసం ఉండే కొండబత్తిని రామకృష్ణతో వివాహం జరిపించారు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. 
 
అయితే, ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా వారిద్దర వర్క్ ఫ్రమ్ హోం కింద కోరుట్లలోని తమ ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు. సాయిలక్ష్మీ ఇటీవల ఉద్యోగం మానేసింది. మరో జాబ్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
 
ఇదిలావుంటే, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సాయిలక్ష్మీ తన గదిలోకి వెళ్లి లోపల గొళ్లెం పెట్టి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొంతసేపటికి భర్త రామకృష్ణ వచ్చి సాయిలక్ష్మీ ఆత్మహత్య విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గొళ్లెం తొలగించి గదిలోకి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. తహసీల్దార్‌ సత్యనారాయణ వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments