Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీ మహిళ అదుర్స్.. శ్రీలంక నుంచి ధనుష్కోడికి.. కొత్త రికార్డ్

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:49 IST)
Smt G. Syamala
హైదరాబాదుకు చెందిన 47 ఏళ్ల మహిళ శభాష్ అనిపించుకుంది. 47 ఏళ్ల వయసులో శ్రీలంక తీరం నుంచి ధనుష్కోడికి 30 కి.మీ ఈతకొట్టి చేరుకుంది. తద్వారా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల చరిత్ర సృష్టించారు. శ్రీమతి శ్యామల ఒక వ్యవస్థాపకురాలు. ఈ సముద్ర ఈత కోసం ఆమెకు సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ త్రివేది శిక్షణ ఇవ్వడమేకాదు, మార్గనిర్దేశం కూడా చేశారు.
 
2012లో 12 గంటల 30 నిమిషాల్లో ఇదే జలసంధిని త్రివేది దాటారు. శ్రీమతి శ్యామల తన సక్సెస్ ఫుల్ జర్నీకోసం కొన్నేళ్ల క్రితం నుంచి త్రివేది దగ్గరే ఈత మెలుకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నది సాధించిన ధీర మహిళగా చరిత్రకెక్కారు. 
 
ఆమె ఏం చేశారంటే.. ?
30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు. సముద్రంలో ఇంత దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు, ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు. శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టిన తరువాత రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments