Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగ్‌రూట్‌లో వెళ్లిన ఆటో.. ఢీకొన్న కంటైనర్ లారీ - ఆరుగురి మృతి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (17:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వెళుతున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మద్నూరు నుంచి బిచ్కుందు జాతీయ రహదారిపై ఆటో ఒకటి రాంగ్ రూట్‌లో వెళుతున్నది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళుతున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకునిపోయింది. 
 
దీంతో ఆటోలో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో రాంగ్ రూట్‌లో రావడంతో పాటు కంటైనర్ లారీ శరవేగంగా రావడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments