రాంగ్‌రూట్‌లో వెళ్లిన ఆటో.. ఢీకొన్న కంటైనర్ లారీ - ఆరుగురి మృతి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (17:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వెళుతున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మద్నూరు నుంచి బిచ్కుందు జాతీయ రహదారిపై ఆటో ఒకటి రాంగ్ రూట్‌లో వెళుతున్నది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళుతున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకునిపోయింది. 
 
దీంతో ఆటోలో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో రాంగ్ రూట్‌లో రావడంతో పాటు కంటైనర్ లారీ శరవేగంగా రావడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments