సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఆరుగురికి రిమాండ్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (14:34 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వీటిని పోస్ట్ చేసి షేర్ చేశారు. ఇలాంటి అనుచిత పోస్టులు చేసిన వారిలో ఆరుగురి సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, మరో ఇద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించిన హైదరాబాద్ సనత్ నగర్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. 
 
గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సీఎం కేసీఆర్ ఫోటోను ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేసి దాన్ని ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లపాడుకు చెందిన పొన్నెకంటి సురేష్‌, కారేపల్లి మండలం బొక్కల తండాకు చెందిన హట్కర్ రాంబాబులకు పంపాడు. 
 
ఈ ఇమేజ్‌ను రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లికి చెందిన జనగంటి అర్జున్‌, పాలమూరు జిల్లా గార్ల మండలం కొత్త పోచారానికి చెందిన కొండమీద కోటేశ్వర రావు, ఖమ్మం జిల్లా తిరమలాయపాలెం మండలం ఏలూరు గూడెం నివాసి నేలమర్రి నారాయణ, పాతర్లపాడు చెందిన నాగేంద్రయ్యలు వివిధ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వీరందరినీ గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments